టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-202213-05-2022 07:51:48 IST
2022-05-13T02:21:48.871Z13-05-2022 2022-05-13T02:21:46.356Z - - 27-05-2022

తెలంగాణ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వ పథకాల అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు లాభం చేకూరడం టీఆర్ఎస్ సర్కారుకు ఇష్టం లేదని ప్రమోద్ సావంత్ అన్నారు. అందువల్లే కేంద్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురాబోతున్నారన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ఈ నెల 14న పాదయాత్ర ముగింపు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తారని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఏమిటో గోవా వచ్చి చూడాలన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను ప్రజలకు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నాం. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారు. వందశాతం కోవిడ్ వాక్సిన్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం గోవా అని, గోవాలో వితంతు పెన్షన్ ఇస్తున్నాం, కల్యాణ లక్ష్మి మా దగ్గర కూడా ఉంది. రూ.లక్ష ఇస్తున్నాం. రైతులకు, పాడి రైతులకు లక్షా ముప్పై వేల రుణం, 40 శాతం బోనస్ కూడా ఇస్తున్నామని ప్రమోద్ సావంత్ వివరించారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసిపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు
11-05-2022
ఇంకా