తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు
22-01-202222-01-2022 21:16:35 IST
2022-01-22T15:46:35.647Z22-01-2022 2022-01-22T15:46:28.841Z - - 27-05-2022

సిఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శనివారం ప్రకటిచారు. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని సీఎం సూచించారు. దళితబంధు అమలు వేగవంతం చేయాని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలతో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని చూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమెదించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో దళితబందు ని సిఎం కేసీఆర్ తెరపైకి తీసుకు వచ్చారని, తర్వాత మరిచిపోయారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్షాల విమర్శలకి చెక్ పెట్టినట్లు అయ్యింది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా