ఈ ఫోన్ల గొడవేంటి బాబూ?
26-11-201826-11-2018 13:32:24 IST
Updated On 26-11-2018 13:32:21 ISTUpdated On 26-11-20182018-11-26T08:02:24.150Z26-11-2018 2018-11-26T08:02:21.995Z - 2018-11-26T08:02:21.997Z - 26-11-2018

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అందరికంటే ముందుంటారు. తాజాగా ఆయన చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వే టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం రంగంలోకి దిగి ఫోన్లద్వారా వారి ప్రోగ్రెస్ రిపోర్టు తెలుసుకుంటున్నారు. ‘నమస్కారం... నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను... మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?, మీరు తృప్తి చెందుతున్నారా? సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళుతున్నారా? మీకు అందుబాటులో ఉంటున్నారా? అవినీతి రహిత పాలన అందిస్తున్నారా?’ అంటూ ప్రశ్నల పరంపరతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లు హోరెత్తుతున్నాయి. త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నేతలు సిద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ అభిప్రాయాలను క్రోడీకరించడం ద్వారా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎవరి అభ్యర్థిత్వాల వైపు మొగ్గుచూపాలనేది నిర్ధారిస్తారు. ఇప్పటికే కొన్ని బృందాలు నియోజకవర్గాల్లో ఎంపికచేసిన ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంలో నిమగ్నమయ్యారు. 83339 99999 నెంబర్ నుంచి ఈ ఫోన్కాల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తిగా ఉంటే మీ ఫోన్లో 1 నెంబరు నొక్కండి.... అసంతృప్తిగా ఉన్నట్లయితే 2 నొక్కండి అంటూ వివిధ ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారికి ఫోన్ చేసి మీకు ఫోన్ వస్తే తమకు అనుకూలంగా సమాచారం ఇవ్వాలంటూ కోరుతుండడం గమనార్హం! మొత్తం మీద ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత చంద్రబాబు చేస్తున్న సర్వేలు రానున్న ఎన్నికల్లో వారి అభ్యర్థిత్వాలపై ప్రభావం చూపుతాయంటున్నారు. 2019 ఎన్నికలలో మళ్లీ గెలుపు సాధించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేతో కొంతమంది ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా గ్రామదర్శిని, జన్మభూమి, సభ్యత్వ నమోదు, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించని ఎమ్మెల్యే లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే తరుణంలో నేరుగా టీడీపీ క్రియాశీలక కార్యకర్తలతో అధినేత చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లు ఇప్పుడున్న జూనియర్లతో సర్దుకోలేక పోతున్నారు. సీనియర్, జూనియర్లను ఎమ్మెల్యేలు సమన్వయం చేయడంలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై ఐవీఆర్ఎస్లో వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తుందోనని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఫోన్ల గొడవేంట్రా బాబూ అంటూ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
3 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
5 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
5 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
10 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
11 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
12 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
13 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
14 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
15 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
15 hours ago
ఇంకా